గోపయ్య కుటుంబాన్ని పరామర్శించిన మల్లిబాబు యాదవ్..

Published: Thursday December 02, 2021
తల్లాడ, డిసెంబర్ 1 (ప్రజాపాలన న్యూస్) : తల్లాడ మండల పరిధిలోని మల్లారం గ్రామానికి చెందిన జొనబోయిన గోపయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ బుధవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాచబంటి పాపారావు, పంపాద్రి, లింగయ్య రామకృష్ణ, సురేష్ పాల్గొన్నారు.