రాజ్ కుమార్ పాండే కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ అన్ని విధాల ఆదుకుంటుంది
Published: Tuesday May 31, 2022
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ గుళ్లపల్లి ఆనంద్
బెల్లంపల్లి మే 30 ప్రజా పాలన ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్ కుమార్ పాండే, హఠాన్మరణం పార్టీకి, అతని కుటుంబానికి తీరని లోటని ఆదిలాబాద్ పార్లమెంటు నియోజక వర్గ ఇంచార్జ్ గుళ్లపల్లి ఆనంద్ అన్నారు.
సోమవారం బెల్లంపల్లి లోని రాజ్ కుమార్ పాండే ఇంటికి వచ్చిన ఆయన, రాజ్ కుమార్ పాండే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యాన్ని కలిపించారు,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు చేసిన రాజ్ కుమార్ పాండే, కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పార్టీ పరంగా ఇప్పటికే తెలియపరచామని, మనోధైర్యాన్ని కల్పించారు.
ఈ కార్యక్రమంలో
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పెరుగు ఆత్మరాం, సంతోష్, అమనుల్లా ఖాన్, తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Share this on your social network: