* చెవెల్ల మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వికారాబాద్ బ్యూరో 26 ఫిబ్రవరి ప్రజాపాలన : చదువే భవ

Published: Monday February 27, 2023
* చెవెల్ల మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 26 ఫిబ్రవరి ప్రజాపాలన :  చదువే భవిష్యత్ జీవన ఆయుధమని చెవెల్ల మాజీ ఎంపి కొండావిశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం కొండా బాలకృష్ణారెడ్డి వేడుక వేదికలో చెవెల్ల మాజీ ఎంపి కొండావిశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను విద్యార్థుల సమక్షంలో జరిగినవి. చదువును ప్రోత్సహించే లక్ష్యంతో కొండామాధవరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి పాఠశాల టాపర్ విద్యార్థులకు చెక్కులను పంపిణీ చేశారు. మాజీ మంత్రి బిజెపి నాయకులు డాక్టర్ ఎ.చంద్రశేఖర్ మాట్లాడుతూ కొండావిశ్వేశ్వర్ రెడ్డి చేసే సామాజిక సేవలు అనిర్వచనీయమని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలోని మరుగుదొడ్లను శుభ్రం చేసే యంత్రాలను పంపిణీ చేయడం అభినందనీయమని స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని మర్పల్లి బంట్వారం మోమిన్పేట్ ధారూర్ కోటపల్లి కుల్కచర్ల గండేడ్ తాండూర్ బషీరాబాద్ పెద్దెముల్ యాలాల్ మండలాలలో ఉన్నత పాఠశాలలో చదివి టాప్ ర్యాంకు తెచ్చుకున్న విద్యార్థులకు, ప్రాథమిక పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జస్టిస్ కొండా మాధవరెడ్డి ఫౌండేషన్ కోఆర్డినేటర్ రాములు ముదిరాజ్, నియోజకవర్గ కోఆర్డినేటర్ లక్ష్మణ్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోకట్ మాధవరెడ్డి, మాజీ కౌన్సిలర్ సుచరితారెడ్డి నరోత్తమ్ రెడ్డి, 
పాండుగౌడ్, మరాటి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.