సిపిఐ జాతీయ మహాసభలను విజయవంతం చేద్దాం

Published: Saturday October 01, 2022
రాష్ట్ర సిపిఐ కౌన్సిల్ మెంబర్ విజయలక్ష్మి పండిట్
వికారాబాద్ బ్యూరో 30 సెప్టెంబర్ ప్రజా పాలన :24వ సిపిఐ జాతీయ మహాసభలను విజయవంతం చేయుటకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర సిపిఐ కౌన్సిల్ మెంబర్ విజయలక్ష్మి పండిట్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణ ముందు భాగంలో అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ 24వ జాతీయ మహాసభల పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర సిపిఐ కౌన్సిల్ మెంబర్ విజయలక్ష్మి పండిట్ మాట్లాడుతూ సిపిఐ పార్టీ ప్రజలకు అండదండగా ఉంటుందని స్పష్టం చేశారు. వికారాబాద్ ప్రాంత మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాల్సిన ఆవశ్యకత ఉందని వివరించారు. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ సిపిఐ ఉంటుందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే 24 వ జాతీయ మహాసభలకు వికారాబాద్ జిల్లా నుంచి పెద్ద పెద్ద సంఖ్యలో రావాలని సూచించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో సిపిఐ పలు ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిందని తెలిపారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా, జమీందారీ జాగీర్ దారి విధానాలకు వ్యతిరేకంగా పోరాడిందన్నారు. వికారాబాద్ జిల్లాలోని పలు సమస్యలను జాతీయ మహాసభలలో మాట్లాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాల్ రెడ్డి, సిపిఐ నాయకులు ఫిర్ మొహమ్మద్ నారాయణ,వెంకటేష్, అనంతయ్య,అబ్దుల్లా, నారాయణ,పుణ్యమ్మ, పరశురాం, సిద్దయ్య, రత్నం, శ్రీను, సతర్, భాగ్యమ్మ తదితరులు ఉన్నారు.