వావిలాల గ్రామాన్ని సందర్శించిన డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు

Published: Tuesday July 06, 2021

జిన్నారం, జులై 05, ప్రజాపాలన ప్రతినిధి : జిన్నారం మండలంలో వావిలాల గ్రామంలో నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా పల్లె ప్రకృతి వనం నర్సరీలను సందర్శించిన డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు, స్థానిక సర్పంచ్ సుశాంతి, స్థానిక ఎంపీపీ రవీందర్ గౌడ్, ఎంపీడీఓ సుమతి, తో కలిసి మొక్కలు నాటారు. డి ఆర్ డి ఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ జిన్నారం మండలంలో వావిలాల గ్రామం ఎంతో అభివృద్ధి చెందుతుంది అందుకు చాలా సంతోషంగా ఉందని గ్రామాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడల్లా గ్రామంలో మార్పులు అభివృద్ధి కనబడడం అభినందించాల్సిన విషయం అని అయన తెలిపారు. నాలుగో విడత పల్లె ప్రగతి భాగంలో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దాలని, వావిలాల గ్రామంలో రహదారులు వీధులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి సర్పంచ్ సుశాంతికీ ఆయన సూచించారు. అనంతరం ఎంపీపీ స్థానిక సర్పంచ్ గ్రామ పంచాయతీ పాలకవర్గం డి ఆర్ డి ఓ శ్రీనివాస రావుకు పూల మొక్కను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిన్నారం మండలం ఎంపీవో రాజ్ కుమార్, పంచాయతీ సెక్రెటరీ ఉప సర్పంచ్ నవనీత్ రెడ్డి, వార్డు సభ్యులు శ్రీనివాస్ గౌడ్, కర్ణాకర్, పద్మవతి, రజిత తదితరులు పాల్గొన్నారు