మండల పట్టణకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

Published: Saturday September 03, 2022
సెప్టెంబర్ 2 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు మండల పట్టణ
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి *డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి*  వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిరియాల వెంకటరమణ గుప్తా* బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు *చావా వేణు* డాక్టర్ రాజశేఖర్ రెడ్డి  చిత్రపటానికి పూలమాలవేసిఘనంగానివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జనహృదయ నాయకుడు డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి  ఆరోగ్యశ్రీ ద్వారా లక్షలాది ప్రజల జీవితాల్లో వెలుగు నింపిన డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తెలుగురాష్ట్రాల జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన నాయకుడు. తెలుగు రాష్ట్రాల సంక్షేమ సారధి అభివృద్ధి ప్రధాత అపర భగీరధుడు డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, రాష్ట్రం వ్యవసాయ రంగంలో పురోగతి, అన్ని వర్గాల కులాలకు మౌలిక సముదాయాలు కల్పించడంలో , సామాన్యుడి ప్రతి అవసరానికి  తీర్చేందుకు ముందున్నారు. ప్రజల మనస్సును గెలిచిన నేత అని, విద్యా,వైద్య,ఆరోగ్యంలో అనేక సంస్కరణలు చేసి పేదల పాలిట దేవుడిగా నిలిచారని అలాంటి మహానీయున్ని సదా స్మరిస్తూ, ఆయన ఆశయ సాధనాలకై ప్రతి ఒక్కరు  వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు *దారా బాలరాజు మున్సిపాలిటీ కౌన్సిలర్లు *కోనాధని కుమార్, మునుగోటి వెంకటేశ్వరరావు* నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు *తూమాటి నవీన్ రెడ్డి* మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు *అద్దంకి రవికుమార్* మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు *దుంప వెంకటేశ్వర రెడ్డి* మాజీ సర్పంచ్ *కర్నాటి రామారావు* మధిర పట్టణ కాంగ్రెస్ నాయకులు *పారుపల్లి విజయకుమార్* పట్టణ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు *షేక్ బాజీ* పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్* డివిజన్ కమిటీ అధ్యక్షులు *బండారు నరసింహారావు, మాగం ప్రసాద్, రామారావు, బానోతు వెంకటరమణ నాయక్, కోటా డేవిడ్, నూరు మొహమ్మద్* మొదలగు వారు పాల్గొన్నారు