ఆలయ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ రేవంత్ రెడ్డి.. పరమేశ్వర్ రెడ్డి

Published: Saturday May 15, 2021
మేడిపల్లి, మే14 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ సర్కిల్లోని హబ్సిగూడ డివిజన్  స్ట్రీట్ నెంబర్ 8 ఎస్ఎస్ నగర్లో శ్రీ కోదండ రామచంద్రస్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రీ రామలింగేశ్వర స్వామి మరియు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, మాజీీ కార్పొరేటర్ మందుముళ్ళ పరమేశ్వర్ రెడ్డి, గిరిబాబు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్, నవీన్, రంజిత్ రెడ్డి, గణేష్ నాయక్ లు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యాదవ రెడ్డి, రాజి రెడ్డి, అజిత్ రెడ్డి,దామోదర్ రెడ్డి, మల్ల రెడ్డి, సుధాకర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, అలుగల అనీల్ కుమార్, అల్వాల భాస్కర్, జనగం రామకృష్ణ, లింగంపల్లి రామకృష్ణ, మంద మురళీ కృష్ణ రెడ్డి, ఢిల్లీ చెంద్ర శేఖర్ రెడ్డి, సందీప్, భాస్కర్, జిత్తు రెడ్డి, కన్నమైన నరేష్ తదితరులు పాల్గొన్నారు.