ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Published: Wednesday April 12, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 11 (ప్రజాపాలన ప్రతినిధి)
సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ,వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకలు పురస్కరించుకొని  మల్లాపూర్, సైనిక్ పూరి చౌరస్తాలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన ఉప్పల్ ఎమ్మేల్యే బేతి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్. ఈ సందర్భంగా పూలే సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జేరిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి, స్వర్ణరాజ్ శివమణి, మాజీ కార్పొరేటర్లు శ్రీనివాస్ రెడ్డి, గోల్లురి అంజయ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, గరిక సుధాకర్, కటార్ల భాస్కర్, బీఎల్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు బైరి నవీన్ గౌడ్, సికిందర్,
నేమూరి మహేష్ గౌడ్, జంపాల్ రెడ్డి, మాస శేకర్ మచ్చా పాండు గౌడ్, భాస్కర్ గౌడ్, శ్రీశైలం అంజి, పాల్గొన్నారు.