కల్యాణలక్ష్మి చెక్కులు మరియు ముఖ్యమంత్రి సహాయనిధిచెక్కులను అందజేసిన - ఎమ్మెల్యే డాక్టర్. క

Published: Thursday May 19, 2022

రాయికల్, మే 18 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండల కేంద్రంలో పద్మశాలి సేవా సంఘం కళ్యాణ మండపంలో ఏర్పాటుచేసిన కల్యాణ లక్ష్మి మరియు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జగిత్యాల నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్.కె. సంజయ్ కుమార్ పాల్గొని రాయికల్ మండలంలో వివిధ గ్రామాలు మరియు పట్టణంలోని 59 మంది లబ్ధిదారులకు 18 లక్షల రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను,  14 మంది ఆడబిడ్డలకు 14లక్షల రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం పట్టణంలోని 8వ వార్డు లో టి .యు.ఎఫ్.ఐ.డి సి. 40లక్షల నిధులతో నిర్మించిన కూరగాయల మార్కెట్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం మార్కెట్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాయికల్ మున్సిపల్ చైర్మెన్ మోరహనుమాన్లు, మండల జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక సభ్యురాలు అశ్విని జాదవ్,మున్సిపల్ వైస్ చైర్మన్ రమాదేవి,  మున్సిపల్ కమిషనర్ సంతోష్ కుమార్,వివిధ గ్రామాల సర్పంచులు,  ఎంపీటీసీలు,  పాక్స్  చైర్మన్, ఏ.ఎం.సి చైర్మన్, డైరెక్టర్లు, పట్టణ వార్డు కౌన్సిలర్లు తుర్గ శ్రీధర్ రెడ్డి,అనిల్, మహేందర్, సాయి, మహేష్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొలశ్రీనివాస్  మండల కార్యదర్శి తలారిరాజేష్ టిఆర్ఎస్ మండలయూత్ ప్రెసిడెంట్ ఎలిగేటిఅనిల్ టిఆర్ఎస్ టౌన్ యూత్ ప్రెసిడెంట్  మోరరామ్మూర్తి, ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.