అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

Published: Thursday February 17, 2022
మేడిపల్లి, ఫిబ్రవరి 16 (ప్రజాపాలన ప్రతినిధి) : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ట్విట్టర్ వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ పిలుపుమేరకు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆదేశానుసారం రామంతాపూర్ డివిజన్ తెరాస ప్రధాన కార్యదర్శి జేసీబీ రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, రామంతాపూర్ పబ్లిక్ స్కూల్ వద్ద రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెరాస నాయకులు గడ్డం రవికుమార్ మాట్లాడుతూ టీపీసీసీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. రేవంత్ రెడ్డికి ఇది తగదని హితవు పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో శాంతియుత వాతావరణంలో అభివృద్దే ధ్యేయంగా పరిపాలన చేస్తుంటే ప్రతిపక్షాలు జన ఆదరణ చూసి తట్టుకోలేక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు గరిక సుధాకర్, తిప్పని సంపత్, సూరం శంకర్, బాల కుమార్, శ్రీనివాస్, విజయ్, శివ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.