బీహార్ అసోసియేషన్ రంగుల హోలీ ఆత్మీయ సమ్మేళనం మేడిపల్లి, మార్చి13 (ప్రజాపాలన ప్రతినిధి)

Published: Tuesday March 14, 2023
కుతుబుల్లాపూర్‌లోని విశ్వకర్మ ఆలయ ప్రాంగణంలో బీహార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగుల హోలీ స్నేహ మిలన్ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా  నిర్వహించారు. ఈ సమ్మేళనంలో  వేలాది మంది బీహార్ ప్రజలు హాజరై  రంగ్ గులాల్‌తో ఒకరితో ఒకరు ఆనందాన్ని పంచుకున్నారు. హోలీ మిలన్ వేడుకలు సాంస్కృతిక కార్యక్రమాలు, తండైతో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వివేక్, మాజీ ఎమ్మెల్యే సేలం పాల్గొన్నారు.        బీహార్ అసోసియేషన్ భవనం కోసం      స్థలాన్ని కేటాయించడానికిి కృషి చేస్తానని ఎమ్మెల్యేే వివేక్ తెలిపారు. . మాజీ ఎమ్మెల్యే సేలం మాట్లాడుతూ బీహార్ ప్రజల సామాజిక సహకారానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, బీహార్ నివాసులను నా సోదర, సోదరీమణులుగా భావిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో 

అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రభాస్ కుమార్, సభ్యులు దిలీప్ కుమార్, రామ్ సింగ్, రవి శంకర్ సింగ్, సుప్రీత్ సింగ్, సూర్య శేఖర్ సింగ్, ఉత్తమ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.