8 నెలల్లో రెండోసారి గ్యాస్ ధరలు పెంచిన కేంద్రం
Published: Friday March 03, 2023
జన్నారం, మార్చి 02, ప్రజాపాలన: ఎనిమిది నెలల్లో రెండోసారి గ్యాస్ ధరలు సిలిండర్ పై కేంద్రం రూ,50 పెంచడంతో సామాన్య జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గ్యాస్ ధరలు అమాంతగా పెంచి ప్రజల నడ్డి పిరుస్తుందన్నారు. మొన్నటి వరకు 1,132 ఉన్న సిలిండర్ పై 50 రూపాయలు పెరిగి 1,182 చేరింది. కార్పొరేట్ శక్తులకు మేలు జరగడానికి గ్యాస్ ధరలు పెంచారన్నారు. గ్యాస్ ధరలు తగ్గించి ఇవ్వలని అవసరాల గ్యాస్ ను 300 కమర్షియల్ గ్యాస్ 400 అందించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరలు రెండోసారి పెరగడంతో మరింత భారం ఉందని పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Share this on your social network: