ఇబ్రహీంపట్నం ఏప్రిల్ తేదీ 4ప్రజాపాలన ప్రతినిధి **మంచాల మండలంలో దశలవారీగా అభివృద్ధి పనులు**

Published: Wednesday April 05, 2023

మంచాల మండల పరిధిలోని చెన్నారెడ్డి గూడ గ్రామంలో జిల్లా పరిషత్ నిధుల నుండి స్మశాన వాటికలో నీటి అవసరాల కోసం బోర్ పనులను ప్రారంభించిన జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంచాల మండలంలో దశలవారికి అభివృద్ధి పనులను చేపడుతున్నామని అందులో భాగంగానే మండలంలోని అన్ని గ్రామాల స్మశాన వాటిక లలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా నీటి అవసరాల కోసం బోరు బావులు తవ్విస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్మదా లచ్చరం, సర్పంచ్ కిషన్ నాయక్, ఎంపీటీసీ పరంగా, సింగిల్ విండో డైరెక్టర్ జెనిగే వెంకటేష్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.