దోమల మందు పిచికారి

Published: Friday August 27, 2021

మధిర, ఆగష్టు 27, ప్రజాపాలన ప్రతినిధి : డెంగ్యూ మలేరియా జ్వరాలు విస్తృతంగా విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మధిర మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డు లో మధిర మునిసిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయాకర్ సూచనలతో వార్డులో దోమల మందు పిచికారి చేయించడం జరిగింది. అనంతరం అంగన్వాడి కేంద్రంలో వ్యాక్సినేషన్ ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డెంగ్యూ వైరల్ జ్వరం విజృంభిస్తున్న తరుణంలో ప్రజలందరూ వారి యొక్క చుట్టుపక్కల పరిసరాలలో నిలువ నీరు ఉండకుండా చూసుకోవాలి అని కోరారు అంగన్వాడి కేంద్రం కూడా ఎప్పటికి అప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, 20వార్డ్ కౌన్సిలర్ ముత్తవరపు రాణిప్యారి, టిఆర్ఎస్ నాయకులు మొండితోక జయకర్ మూతవరపు ప్యారి, అంగన్వాడి టీచర్లు ఆశావర్కర్లు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు