హోటళ్లను తనిఖీ చేసిన కమిషనర్ రమాదేవి

Published: Friday September 24, 2021
మధిర, సెప్టెంబర్ 23, ప్రజాపాలన ప్రతినిధి : శ్రీయుత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మధిర మునిసిపల్ పరిధిలో గల తోపుడు బండ్ల మీద ఆహార పదార్థాలు అమ్మే వారికి మరియు హోటల్ యజమానులకు మధిర మునిసిపల్ కమిషనర్ A.రమాదేవి తనిఖీ చేసి ఆయా నిర్వాహకులకు సిబ్బంది కి పలు సూచనలు చేశారు. ప్రతి బండి వద్ద మరియు హోటల్ వద్ద తప్పనిసరిగా చెత్తబుట్టలను వినియోగించాలని, చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఆహార పదార్థాలు పై ఈగలు వాలాకుండ తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేనిచో చట్టపరమైన చర్యలకు భాద్యులు అవుతారని సూచించారు. కమీషనర్ తో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.