ఆర్ కృష్ణయ్య చేతుల మీదుగా నియమాక పత్రం అందుకున్న పోలముని రాజేష్ గౌడ్*

Published: Monday September 19, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 18 ప్రజాపాలన ప్రతినిధితుర్కాంజెల్ రొక్కం సత్తిరెడ్డి గార్డెన్లో జరిగిన బిసి కుల సంఘాల సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి మరియు విద్యార్థి యువజన సంఘం అధ్యక్షులు అనంతల రామ్మూర్తి గౌడ్ గారి ఆధ్వర్యంలో సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పొలగ రాజేష్ గౌడ్ గారి నియామకం జరిగింది చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని వెనుకబార్డు గురవుతున్న బీసీల హక్కుల పట్ల పోరాటం చేయనీకి బీసీ యువత ముందుకు రావాలని రాజేష్ గౌడ్ అన్నారు ఆర్ కృష్ణయ్య గారి ఉద్యమాలు మరియు రామ్మూర్తి గౌడ్ గారి నాయకత్వాన పనిచేయనీకి సిద్ధంగా ఉన్నామని నాపై నమ్మకం ఉంచి గొప్ప పదవులు కల్పించినందుకు సంఘానికి మరియు కృష్ణన్నకు రామ్మూర్తి గౌడ్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నానని రాజేష్ గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాటి మహేష్ గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అభిలాష్ యాదవ్ రాష్ట్ర కార్యదర్శి గుర్రం విజయ్ కుమార్ మరియు గిరిజన సంఘం డాక్టర్ రెగ్య నాయక్ గారు మరియు మేజర్ సంఘం జగన్ చెన్నయ్య పాల్గొన్నారు.