ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డి సి సి కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్

Published: Monday November 01, 2021
బోనకల్, అక్టోబర్ 31, ప్రజాపాలన ప్రతినిధి: బోనకల్ మండలంలోని కలకోట గ్రామ పంచాయతీలో హైస్కూల్ ఆవరణములో అక్షయ కంటి ఆసుపత్రి ఖమ్మం వైద్యునిపుణులచే ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్ ప్రారంభించడం జరిగింది. అనంతరం కిషోర్ కుమార్ మాట్లాడుతూ సాంకేతిక ఆహారపు అలవాట్ల ప్రభావం వల్ల చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారని, అందువలన ఈ యొక్క ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గ్రామంలోని ప్రజలందరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యంగల దయామణి, ఉప సర్పంచ్ చావా హరిత, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ బరుగుల అచ్చయ్య, గ్రామస్తులు ప్రజలు పాల్గొన్నారు.