*టి ఎస్ పి ఎస్ సి పరీక్ష పేపర్ లీక్ ఘటన మీద సమగ్ర విచారణ చేయాలి* -- నేషనలిస్ట్ స్టూడెంట్ కాంగ్ర

Published: Tuesday March 14, 2023
మంచిర్యాల టౌన్, మార్చి 13, ప్రజాపాలన: టి ఎస్ పి ఎస్ సి  పేపర్ లీక్ ఘటన మీద సమగ్ర విచారణ చేయాలని నేషనలిస్ట్ స్టూడెంట్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పురేళ్ళ నితీష్ అన్నారు. సోమవారం
జిల్లా కేంద్రంలోని ఎస్ సి బాలుర వసతి గృహం లో ఏర్పాటు చేసిన వీలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడుతూ అత్యంత రహస్యం గా  ఉంచాల్సిన సమాచారాన్ని  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్     నిర్లక్ష్యంతోనే మున్సిపల్ టౌన్ ప్లాన్ అధికారి పరీక్ష పేపర్ లీక్ జరిగిందని, దాన్ని కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో హకింగ్ అని లీకులు ఇచ్చారని, అలాగే లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో  చెలగాటం ఆడుతుందని ఆరోపించారు. తన వ్యక్తిగత అవసరల కోసం టి ఎస్ పి ఎస్ సి   కార్యదర్శి పి ఎ ప్రవీణ్ పేపర్ లీక్ చేసే దుస్థితికి  కెసిఆర్ ప్రభుత్వం దిగాజారచ్చిందని, పేపర్ లీక్ ఘటన వెనక ప్రవీణ్ కుమార్ తో పాటు మాజీ టి ఎస్ పి ఎస్ సి సభ్యుని పాత్ర అలాగే  చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనిత రామచంద్రన్ తో పాటు సభ్యుల అందరి మీద విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షంచాలని డిమాండ్ చేశారు. లేని యెడల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వంశీ, శివ తదితరులు పాల్గొన్నారు.