కరోనా విజృంభిస్తున్నది... జాగ్రత్తలు పాటించండి. పాలేరు ఎమ్మెల్యే కందాల

Published: Thursday April 22, 2021
పాలేరు, ఏప్రిల్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా:- కూసుమంచి మండలం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి. కరోనా వైరస్ విజృంభిస్తున్న దృశ్య. పాలేరు నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి.. ముందు గా జాగ్రత్తలు పాటిద్దాం...కరోనా వైరస్ వ్యాప్తిని అరికడదాం.. సాధ్యమైనంత వరకు ఇంటి వద్దనే ఉండండి. తరచూ చేతులను కడుగుతూ ఉండండి. అపరిశుభ్ర చేతులతో మోకాన్ని తాకకండి. తుమ్మినా దగ్గినా మోచేతిని అడ్డు పెట్టుకోండి. ఒకరికొకరు సామాజిక దూరం పాటించండి. తప్పనిసరి పరిస్థితులలో బయటకు వెళ్లాల్సివస్తే శానిటైజర్ వాడండి తప్పనిసరిగా మాస్క్ ధరించండి.