బయ్యారం గ్రామంలో ముమ్మరంగా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Published: Monday February 22, 2021

మధిర, ఫిబ్రవరి 21, ప్రజాపాలన: మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బయ్యారం గ్రామంలో ముమ్మరంగా టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. గ్రామానికి చెందిన మెడిది రవికి సభ్యత్వం ఇచ్చిన మార్కెట్ కమిటీ చైర్మన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో పార్టీ సభ్యత్వ నమోదుకు గ్రామశాఖ అధ్యక్షులు, పార్టీ సభ్యత్వ నమోదును ముందుండి నడిపించాలని, ప్రతి గ్రామంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయిలురి ఉమా మహేశ్వర్ రెడ్డి, మర్శకట్ల ఆంథోనీ, బాలస్వామి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు