భవిష్యత్ తరాల కోసం మొక్కలు నాటాలి : మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్

Published: Thursday July 22, 2021
మేడిపల్లి, జూలై 21 (ప్రజాపాలన ప్రతినిధి) : భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ హాజరై ప్రెస్ క్లబ్ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ పచ్చదనం, స్వచ్ఛమైన గాలి కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు దొంతుల వెంకట్ రామ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కూకుట్ల నరోత్తం రెడ్డి, కార్యనిర్వాహణ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు సురేష్, సాగర్, శ్రీధర్ రావు, సంయుక్త కార్యదర్శి శివాజీ, కోశాధికారి యాదగిరి, ముఖ్య సలహాదారులు సురేష్, మహేందర్ రెడ్డి, జర్నలిస్ట్ కిషోర్, మేడ్చల్ అర్బన్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి, ఉప్పల్  డివిజన్  బీజేపీ అధ్యక్షులు రెడ్డి గారి దేవేందర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు మహంకాళి లక్ష్మణ్, రావుల బాలకృష్ణ, మణిందర్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.