కమ్మ సేవా సమితి మధిర ఆధ్వర్యములో కరొనా రోగులకు బోజన పంపిణీ కార్యక్రమం బుధవారం ప్రారంభం

Published: Thursday June 03, 2021
మధిర, జూన్ 02, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధి కమ్మ సేవ సేవా సమితి నేతలు గడ్డం శ్రీనివాస రావు, చెరుకూరు నాగార్జున అడ్యక్షథన జరిగిన కార్యక్రమములో కమ్మ కుల పెద్దలు పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్, రావి కోటేశ్వరావు, రిటిర్ద్ ఉద్యోగి మల్లాది చిన్న వెంకటేశ్వర్లు చేతుల మీదుగా భోజనం ప్యాకెట్ లు పంపిణీ ప్రారంభించారు. ఈ రోజు దాత వీరమాచినేని శ్రీనివాస రావు. ఈ కార్యక్రమము లో సేవా సమితి నాయకులు మేడ వెంకటేశ్వరావు, చావా రవి, చలసాని సుబ్బారావు, మల్లాది నిశాంత్ చౌదరి, నరమనేని అనీల్, పాల్గొన్నారు. సామాజిక సేవాకుడు లంకా కొండయ్య, అన్నం ఫౌండేషన్ రామకృష్ణ, నిస్డిహరి ని సన్మానించిన కమ్మ సేవా సమితి సభ్యులు. సేవా సమితి వాలెంటీర్లు కరొనా రోగుల ఇంటికి వెళ్లి 120 బోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు.