భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో మండల నాయకులు టీపీసీసీ సభ్యులూ పైడిపల్లి కిషోర్ కుమార్,కలక

Published: Monday April 10, 2023

బోనకల్, ఏప్రిల్ 09 ప్రజాపాలన ప్రతినిధి: మధిర శాసనసభ్యులు సిఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చి పాదయాత్ర 22వ రోజు మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండలం దిబ్బపల్లి గ్రామంలో కొనసాగుతున్న పాదయాత్రలో ఆదివారం టిపిసిసి సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్,కలకోట సొసైటీ ఛైర్మన్ కర్నాటి రామ కోటేశ్వరరావులు పాల్గోన్నారు.ఈ సందర్భంగ కిషోర్ కుమార్, కర్నాటి కోటి ఇటీవలే కాలంలో రెండవసారి అకాల వర్షం,గాలి వానకు క్రిందపడ్డ *మొక్కజొన్న పంటలకు కూడా విపత్తు నివారణ చర్యలు క్రింద పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టాలని భట్టి విక్రమార్క దృష్టికి తీసుకు వెళ్లారు.సమస్యను తెలుసుకున్న విక్రమార్క స్పందిస్తూ జిల్లా కలెక్టర్ విపీ గౌతమ్ తో పోన్ లో మాట్లాడి రెండవ విడత ఆకాల వర్షాల వల్ల నష్టపోయిన మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారాన్ని రైతులకు అందేలా పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు భద్రు నాయక్ పాల్గొన్నారు.