సభ్యత్వ నమోదు లో ప్రథమ స్థానంలో నిలవాలి : రావుట్ల సత్యనారాయణ

Published: Monday June 20, 2022

బోనకల్, జూన్ 19 ప్రజా పాలన ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు లో బోనకల్ మండలం ప్రథమస్థానంలో నిలవాలని మండల అధ్యక్షులు రావుట్ల సత్యనారాయణ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ముష్టికుంట్ల గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గ్రామ అధ్యక్షుడు బందం హుస్సేన్ మండల ఉపాధ్యక్షుడు బంధం రంగయ్య లకు సభ్యత్వాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రావుట్ల సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని, తెలుగుదేశం పార్టీ నూతనంగా తెలుగుదేశం కార్యకర్తల కోసం ప్రారంభించిన ఆరోగ్య భరోసా పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం తీసుకున్న వారికి రాయితీ ద్వారా ఆర్థిక భరోసా లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బంధం అనిల్, బంధం రంగయ్య,బంధం హుస్సేన్, సంఘపు బుచ్చిబాబు,రామారావు,జడ్డ కృష్ణ, బొడ్డు పల్లి రామారావు,షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు.