విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ జామెంట్రీ బాక్స్ లు అందజేసిన టిఆర్ఎస్ రాష్ట్ర సంయుక్త కార్యద

Published: Thursday May 19, 2022

ఇబ్రహీంపట్నం మార్చి తేది 18 ప్రజాపాలన ప్రతినిధి.

ఈనెల 23నుంచి పదోతరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఖానాపూర్ లో పరీక్ష ప్యాడ్లు, జామెంట్రీ బాక్స్ లు పెన్నులు, {పరిక్ష సామగ్రిని}అందజేసిన టిఆర్ఎస్వీ  రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పి. రాజ్ కుమార్
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, పదోతరగతి అనేది మొదటి మెట్టులాంటిది అని, నిర్లక్ష్యం చేయకుండా కష్టపడి చదువుకొని మంచి మార్కులతో పాస్ కావాలని సూచించారు.
ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాస్తే అనుకున్న ఫలితాలు సాధించవచ్చున్నారు , ఉత్తమ ఫలితాలు సాధించి గురువులకు తల్లిదండ్రులకు మంచిపేరు తీసుక రావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మడుపు వేణుగోపాల్ రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు పంది మహేందర్, సీనియర్ నాయకుడు వర్కలా శివరాజ్ గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వల్లవోజు తిరుమల్ ,పంది ప్రకాష్, ఆకుల శ్రీనివాస్, పంది చరణ్, సౌనిత్, ధోని,  తదితరులు పాల్గొన్నారు.