శ్రీ వైభవలక్ష్మీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు

Published: Thursday October 07, 2021
వికారాబాద్ బ్యూరో 06 అక్టోబర్ ప్రజాపాలన : 7 అక్టోబర్ 2021 గురువారం నుండి 15 అక్టోబర్ 2021 శుక్రవారం వరకు శ్రీదేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపబడునని శ్రీ వైభవలక్ష్మీదేవి ఆలయ ప్రధాన అర్చకులు విక్రమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొమ్మిది రోజులు పాటు వివిధ అలంకరణలతో శ్రీ వైభవలక్ష్మీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు శైలపుత్రి దేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారని పేర్కొన్నారు. ఉదయం 5:00గం.లకు సుప్రభాత సేవ, మహా అభిషేకము, 11:00 గంటలకు లలితాసహస్రనామ పారాయణం తదుపరి మహా హారతి తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించబడునని స్పష్టం చేశారు. భక్తులు అందరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ వ్యవస్థాపకులు తమ్మలి రమేష్ తెలిపారు.