ఎడ్ల పందాల్లో మొదటి బహుమతి పొందిన పొన్నారమ్.

Published: Monday March 28, 2022
బెల్లంపల్లి మార్చి 27 ప్రజాపాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చిన్న బూద గ్రామంలో ఆదివారం నాడు నిర్వహించిన జిల్లా స్థాయి ఎడ్ల పందాల్లో మొదటి బహుమతి దక్కించుకున్న పొన్నారం గ్రామం. ఈ పోటీల్లో మొత్తం 9 జతల ఎడ్లు పాల్గొనగా మొదటి బహుమతి మందమర్రి మండలం పొన్నారం గ్రామానికి చెందిన వారు కైవసం చేసుకోగా, రెండో బహుమతి చెన్నూరు మండలం భీమవరానికి దక్కించుకోగా, మూడవ బహుమతి ఇందారం గ్రామానికి చెందిన వారు దక్కించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. మొదటి బహుమతి  నాలుగు వేల రూపాయలు, రెండవ బహుమతి మూడువేల రూపాయలు, మూడో బహుమతి రెండు వేల రూపాయలు నిర్ణయించి, గెలుపొందిన వారికి మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోంగల మల్లేష్ బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ తోంగల సత్యనారాయణ, బెల్లంపల్లి మండల ఎంపీపీ రాణి సురేష్, బొప్ప అర్జయ్యా, ఆవుల కొమురయ్య, దాసరి నర్సయ్య, డోల్క సత్తయ్య, సారం రాజయ్య, ముత్య మురళి, అచ్చే శివాజీ, కొత్తపల్లి నవీన్, తదితరులు పాల్గొన్నారు.