మీనవోలు గ్రామ ఎమ్మార్పీఎస్, ఎం ఎస్ ఎఫ్ కమిటీ ఎన్నిక.....

Published: Saturday January 22, 2022
ఎర్రుపాలెం జనవరి 21 ప్రజా పాలన ప్రతినిధి: మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ఎం ఎస్ ఎఫ్ కమిటీ నిర్మాణం జరగాలని నిర్ణయం ప్రకారం ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామంలో ఎం ఎస్ ఎఫ్ కమిటీ తో పాటు ఎమ్మార్పీఎస్ కమిటీ నిర్మాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎం ఎస్ ఎఫ్ నాయకులు కూరపాటి సునీల్ కుమార్ మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కూరపాటి ప్రభాకర్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని వర్గీకరణ ద్వారానే మాదిగల అభివృద్ధి సాధ్యమని ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని మాట్లాడడం జరిగింది. అనంతరం కమిటీ నిర్మాణం చేయడం జరిగింది. ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బోడి పల్లి మహేష్ మాదిగ, కమిటీ సభ్యులుగా భాగ్య రావు మాదిగ, జమలయ్య మాదిగ, ఆనందరావు మాదిగ, శ్రీను మాదిగ, మాధవరావు మాదిగ, వెంకటేశ్వర్లు మాదిగ, ప్రభాకర్ మాదిగ, చిన్న నారాయణ మాదిగ, దావీదు మాదిగ, చిన్నోడు మాదిగ, ప్రభాకర్ మాదిగ, కోటేశ్వర మాదిగ అశోక్ మాదిగ. ఎం ఎస్ ఎఫ్- గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కుక్కల అఖిల్ మాదిగ, కమిటీ సభ్యులుగా వినోద్ మాదిగ, రవీందర్ మాదిగ, విలియం కేరి మాదిగ, వినయ్ మాదిగ, ప్రవీణ్ మాదిగ, వెంకటరత్నం మాదిగ, కిషోర్ మాదిగ, సందీప్ మాదిగ, పురుషోత్తం మాదిగ, సుబ్బారావు మాదిగ, విజయ్ మాదిగ, సుబ్బారావు మాదిగ, విజయ్ మాదిగ, ప్రభాకర్ మాదిగ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.