అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
Published: Wednesday November 23, 2022
ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి
మేడిపల్లి, నవంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ నియోజక వర్గం హబ్సిగూడ డివిజన్ రాంరెడ్డి నగర్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ మేరకు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అధికారులతో కలిసి డివిజన్లో పర్యటించి అభివృద్ధి పనులను పర్యవేక్షించి, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్వరితగతిన అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్, వాటర్ బోర్డ్ అధికారులతో పాటు డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ బి.వి చారి, పల్లె నర్సింగ్ రావు స్థానిక నాయకులు పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.
Share this on your social network: