దళిత కుటుంబాల అభివృద్ధికి తెరాస కృషి. ...ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖనాయక్
Published: Tuesday December 06, 2022
జన్నారం, నవంబర్ 05, ప్రజాపాలన:
పేదదళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం కెసిఆర్ దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖనాయక్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కెసిఆర్ ప్రారంభించిన ప్రతి పథకం దేశంలో సంచనలు సృష్టించాయిని అన్నారు. ప్రతి కుటుంబానికి తెరాసా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలం దక్కుతుందని అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇంధనపెల్లి, ముర్రిగూడెం గ్రామాల్లో పర్యటించి దళిత ప్రజలకు దళిత బంధు పథకం గురించి విశ్లేషించారు. దళారులను నమ్మొద్దు అని ఎవరైనా పథకం ఇప్పిస్తాం అని మోసపూరిత మాటలు చెబితే తన దృష్టికి తీసుకొని రావాలని ఎమ్మెల్యే అజ్మీరా రేఖనాయక్ సూచించారు. అనంతరం గ్రామాలలో జరుగుతున్న పనులను అధికారుల పనితీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గుర్రం రాజారాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సిలువ జనార్ధన్, వైస్ ఎంపీపీ వినయ్ కుమార్, ముత్యం సతీష్, జన్నారం మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: