నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక*

Published: Tuesday December 20, 2022
మంచిర్యాల టౌన్, డిసెంబర్ 19, ప్రజాపాలన: నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ మంచిర్యాల  జిల్లా నూతన కమిటీ ఎన్నిక విద్యార్థి సంఘము, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు జుమ్మిడి గోపాల్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున మంచిర్యాల పట్టణం లోని ఎస్ ఆర్ ఆర్ జూనియర్ కాలేజి లో జిల్లా సదస్సు నిర్వహించారు. అనంతరం నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు గా ముడిమడుగుల శేఖర్,ఉపాధ్యక్షులుగా సోదారి శ్రావణ్,జిల్లా ప్రధాన కార్యదర్శి గా మీసాల రాజు,సహాయ కార్యదర్శి గా శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పాయిడి మల్లికార్జున్, కోశాధికారి గా గోళ్ళ సాయి, జిల్లా నాయకులు గా రంజిత్, సంతోష్, రమేష్,రాజేష్,మహేష్, ఆనంద్ లకు నియామక పత్రాలు అందజేశారు.