మేట్ పల్లి పెద్ద చెరువును పర్యవేక్షించిన కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు.
Published: Friday July 15, 2022
కోరుట్ల, జూలై 14 (ప్రజాపాలన ప్రతినిధి):
గత వారం రోజుల నుండి ఎడతెరిపిలేని వర్షాల కారణంగా మెట్ పల్లి పట్టణంలోని పెద్ద చెరువుకు వరద నీటి ప్రవాహం ఎక్కువ కావడం వల్ల పెద్ద చెరువు వల్ల ఎటువంటి నష్టం వాటిల్లకూడదని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అధికారులతో కలిసి గురువారం రోజున పెద్ద చెరువును పర్యవేక్షించారు.ఎప్పటికపుడు నీటి తీవ్రతను పర్యవేక్షించాలని, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Share this on your social network: