ఫ్రీడమ్ బాయ్స్ అధ్వర్యంలో నివేదిత వృద్ధాశ్రమంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

Published: Monday September 05, 2022

కోరుట్ల, సెప్టెంబర్ 04 ( ప్రజాపాలన ప్రతినిధి ):

వినాయక చవితి నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని ఫ్రీడమ్ బాయ్స్ (శాలివాహన యూత్) ఏకీన్ పూర్ అధ్వర్యంలో మల్లాపూర్ మండలం లోని సాతరం గ్రామము లో గల నివేదిత వృద్ధాశ్రమం లో నిత్యావసర వస్తువులు 1.50కేజీల బియ్యం, 5కేజీల పెసర పప్పు, 5కేజీల కంది పప్పు, 20 లీటర్ల నూనె, 20 కేజీల ఉల్లిగడ్డలు, టమాటాలు, సబ్బులు, అరటి పండ్లు, ఆపిల్స్, బిస్కెట్స్, మిరపకాయలను ఆందిచారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినప్పుడే నిజమైన దైవాశీస్సులు లభిస్తాయని, రానున్న రోజుల్లో మా యొక్క యూత్ సేవల మరింత విస్తీర్ణం చేస్తూ సమాజ సేవ మరింత పెంపొందిడానికి కృషి చేస్తామని యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వంశీ, సతీష్, రాజేందర్, నాగరాజు, రాకేష్, ప్రశాంత్, వంశీ, పురుషోత్తం, యోగి, రతీష్, పవన్, గణేష్, వెంకట్, రవి తదిధరులు పాల్గొన్నారు.