పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు వేలాది క

Published: Tuesday February 28, 2023

బోనకల్ , ఫిబ్రవరి 27 ప్రజా పాలన ప్రతినిధి:మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామం లో రెండవ విడత కంటి వెలుగు ప్రారంభోత్సవం లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు పథకం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం నాడు బ్రాహ్మణపల్లి లో ఏర్పాటు చేసిన రెండవ విడత కంటి వెలుగు పథకాన్ని గ్రామ సర్పంచ్ జెర్రిపోతుల రవీంద్ర తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కంటి వెలుగు శిబిరం లో వైద్యులు అందుబాటులో ఉండి పరీక్షలు చేసిన అనంతరం వారికి అవసరమైన కంటి అద్దాలను అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రజలెవరు కంటి సమస్యల తో బాధపడవద్దనే లక్ష్యం తో కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలతో పాటుగా మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. వేలాది కుటుంబాలకు అండగా మారిన బృహత్తర పథకం కంటి వెలుగు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో పేద కుటుంబాలకు భరోసా కలుగుతుందని స్పష్టం చేశారు. ఈ కంటి వెలుగు ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్, హెల్త్ సూపర్వైజర్ దానయ్య, ఎం పి ఓ సుబ్రహ్మణ్య శాస్త్రి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, మాజీ అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, మండల కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, మండల రైతు కన్వీనర్ వేమూరి ప్రసాద్, రజక సంఘం నాయకులు తమ్మారపు బ్రహ్మయ్య, బీఆర్ఎస్ నాయకులు కొనకంచి నాగరాజు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆశా కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.