హెల్త్ సిబ్బందిని సన్మానించిన బండ లింగారెడ్డి

Published: Thursday October 28, 2021

కొడిమ్యాల, అక్టోబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామంలో బుధవారం లయన్స్ క్లబ్ కొడిమ్యాల మండలాధ్యక్షులు బండ లింగారెడ్డి ఆధ్వర్యంలో వంద కోట్ల వ్యాక్సినేషన్ పూర్తయిన సందర్బంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సిబ్బందిని కోవిడ్-19 కష్టకాలంలో చేసిన సేవలను గుర్తించి వారందరినీ పూడూర్ హెల్త్ సెంటర్ లో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యవర్గ సభ్యులు భూషణ్ రెడ్డి, సంతోష్, మల్లేశం, అమరేందర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, మనోహర్, రమేష్, పూడూర్ సింగల్ విండో చైర్మెన్ బండ రవీందర్ రెడ్డి,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.