వికారాబాద్ జర్నలిస్ట్ కాలనీ సమీపంలో ఏవం సినిమా షూటింగ్

Published: Tuesday March 14, 2023
* ఏవం సినిమా నిర్మాత పవన్ గోపరాజు
వికారాబాద్ బ్యూరో 13 మార్చి ప్రజాపాలన : థ్రిల్లర్ కథాంశంతో సి స్పేస్ బ్యానర్ కింద ఏవం చిత్రాన్ని వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నామని సినిమా నిర్మాతలలో ఒకరైన పవన్ గోపరాజు అన్నారు. సి స్పేస్ బ్యానర్ కింద రెండవ సినిమా షూటింగ్ చేస్తున్నారని తెలిపారు. సోమవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం గ్రామానికి సంబంధించిన జర్నలిస్ట్ కాలనీ సమీపములోని మామిడి తోటలో ఏవం థ్రిల్లర్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో ఏవం సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. సినిమా నిర్మాతలుగా నవదీప్ పవన్ గోపరాజులు వ్యవహరిస్తున్నారని వివరించారు. ఏవం సినిమా హీరో గా జై భరత్ రాజ్, హీరోయిన్ గా చాందిని చౌదరి, గోపరాజు రమణ తదితరులు నటిస్తున్నారని వెల్లడించారు. మార్చి మొదటి వారం నుండి ఏప్రిల్ మాసాంతం వరకు చిత్రీకరించనున్నామని సినిమా నిర్మాతలలో ఒకరైన పవన్ గోపరాజు తెలిపారు.