పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
Published: Friday June 24, 2022
కార్పొరేటర్ చేతన హరిష్
మేడిపల్లి, జూన్23 (ప్రజాపాలన ప్రతినిధి)
వర్షాకాలంలో ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని హబ్సిగూడ కార్పొరేటర్
కక్కిరేణి చేతన హరిష్ సూచించారు. ఈమేరకు కార్పొరేటర్ హబ్సిగూడలోని గిరిజన బస్తీ వాసులను కలిసి బస్తీలో పర్యటించి వర్షాకాలం వస్తున్నందున ముందస్తు జాగ్రత్త నివారణ చర్యలను పర్యవేక్షించారు. నివాస స్థలాల చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేనిచో అంటు వ్యాధులు, జ్వరాలు వ్యాపిస్తాయని తెలియజేశారు. కావున బస్తీవాసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిసరాలను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలనో ఎంటమాలజీ అధికారులు నరేష్ రెడ్డి, సాయి రెడ్డి మరియు వారి సిబ్బందితో కలిసి బస్తీవాసులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు సంజయ్ పటేల్, న్యాలకొండ సుమన్ రావు, రంగా రవి, పర్తియానాయక్, చింతకింది ప్రవీణ్, ప్రవీణ్ ,చారి, శివగౌడ్ పాల్గొన్నారు.
Share this on your social network: