కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Published: Thursday July 01, 2021

జన్నారం, జూన్ 30, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్రంలోని దళిత కుటుంబాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రూపాయలు 10 లక్షలు వస్తున్నట్లు ప్రకటించడం సంతోషకరమని దళితుల అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఎల్లప్పుడూ ముందుంటారని ఎంపీపీ సరోజన రవీందర్రావు అన్నారు, బుధవారం మండల కేంద్రంలో గల తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు, ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ దళితుల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ రూపాయలు 10 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి చెల్లించడం హర్షించదగ్గ విషయం అన్నారు, దళితులకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి అలాగే రూపాయలు 10 లక్షలు ఇవ్వడం సంతోషకరమన్నారు, ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుతారి వినయ్ ఫోన్ కాల్ ఉప సర్పంచ్ శ్రీనివాస్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముజాఫర్ అలీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సతీష్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు