రైలు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని పరామర్శించిన 108 సిబ్బంది

Published: Wednesday July 28, 2021

ఏరుపాలెం, జులై 27, ప్రజాపాలన ప్రతినిధి : ఈనెల 13వ తారీఖున ఎర్రుపాలెం గ్రామానికి చెందిన షేక్ మాబు సుభాని ఎర్రుపాలెం నుంచి ట్రైన్ లో ఖమ్మం వెళ్తుండగా మోటమర్రి రైల్వేస్టేషన్ లో కృష్ణ ఎక్స్ ప్రెస్ రైల్లో నుంచి ప్రమాదవశాత్తు  జారిపడి పోవడంతో అతని ఎడమ కాలు తెగిపోయింది. అక్కడ ఉన్న స్థానికులు 108 కి సమాచారం ఎవ్వడంతో. బోనకల్ 108 సిబ్బంది అతనినీ 108 అంబులెన్స్ లో ప్రథమ చికిత్స అందిస్తు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. అతను ప్రాణాపాయ స్థితి నుండి బయటపడడంతో అతని దగ్గరికి 108 సిబ్బంది ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్ గజ్జలకొండ శివ నాగేశ్వరరావు పైలెట్ కన్నెపోగు మణికుమార్లు వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకోవడం జరిగింది.108 సిబ్బందిని వారి కుటుంబ సభ్యులు అభినందించారు.