డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలి

Published: Friday April 16, 2021
వికారాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎం.రవీందర్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 15 ప్రజాపాలన : సొంత ఇండ్లు లేక అద్దె ఇళ్ళలో ఉంటూ నెల నెల అద్దె చెల్లిస్తూ ఆర్థిక ఇబ్బదులతో జర్నలిస్తులు జీవనం సాగిస్తున్నారాని  వికారాబాద్  ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎం రవీందర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులు వికారాబాద్ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ను ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇండ్లస్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వినతి పత్రంలో పేర్కొంటూ తమ అందరికీ ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరడం జరిగింది. అలాగే మండల కేంద్రాలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా ఇండ్లు ఇంటి స్థలాలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని అడగడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్, ఉపాధ్యక్షుడు జి. నర్సింహులు, మహేందర్, కోశాధికారి టి. గోపాల్, జాయింట్  సెక్రటరీ మురళీ కృష్ణ, మహేష్, కార్యనిర్వహణ కార్యదర్శి రవీందర్, సభ్యులు మాచన్నగారి గైబులు ముదిరాజ్, చుక్కయ్య, బతుకమ్మ వెంకట్, సంతోష్, వెంకటేష్, ప్రమోద్, నాగిరెడ్డి, జగదీష్, సమ్మనిరవి, దేవేందర్ ముదిరాజ్, రాజు, భాస్కర్, రవీందర్, అశోక్, వెంకటయ్య, అశోక్, విజయ్, కృష్ణ, నర్సింహులు,  కోఠీ, తదితరులు పాల్గొన్నారు.