బిఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ గ్రామ కమిటీ మరియు యువజన కమిటీ ఏర్పాటు బూర్గంపాడు ( ప్రజా పా

Published: Saturday December 03, 2022

 బుర్గం పహాడ్ మండలం లోని నాగినేని ప్రోలు రెడ్డి పాలెం గ్రామంలో భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతా రావు  ఆదేశాల మేరకు ముస్లిం మైనారిటీ గ్రామ కమిటీ మరియు గ్రామ యువజన విభాగం కమిటీ వేయడం జరిగిందన ఈ కార్య క్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ కార్య క్రమాలు ప్రజల లోకి తీసుకు వెళ్ళడం లో గ్రామ కమిటీ మరియు గ్రామ యువజన విభాగం కీలక పాత్ర పోషించాలని మైనారిటీ మండల ఇంచార్జి జక్కం సుబ్రహ్మణ్యం  అన్నారు., మైనారిటీ మండల అధ్యక్షుడు షేక్ సాధిక్ పాషా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల మైనారిటీ ప్రధాన కార్యదర్శిగుల్ మొహమ్మద్ మాట్లాడుతూ భవిష్యత్ రాజకీయాల్లో యువకులు అన్నీ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి  అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళి ప్రచారం చేయాలన్నారు, మన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు రేగ కాంతా రావు  చేస్తున్న అభివృద్ధిని అందరికి తెలిసేలా గ్రామంలో ఉన్న నాయకులు,  మరియు యువత బాధ్యత తీసుకోవాలన్నారు.,అదే విధంగా గ్రామాల్లో ఉన్న సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు,ఈ నియోజక వర్గం అభివృద్ది కేవలం రేగ కాంతా రావు గారితో నే సాధ్యం అన్నారు,ఈ సందర్భంగా మండల మైనారిటీ ఇంచార్జి జక్కం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ భవిష్యత్తు నాయకుడు రేగ కాంతా రావు  అని,వచ్చే ఎన్నికల్లో మనం అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ఎమ్మెల్యే రేగా కాంతా రావు ని  గెలిపించి మంత్రి స్థానంలో నిల పెట్టాలని కోరారు,ఈ సందర్భంగా ఎన్నుకున్న నాగీనేని ప్రొలు రెడ్డి పాలెం గ్రామ కమిటీ  అధ్యక్షులుగా మొహమ్మద్ సత్తార్,  ఉపాధ్యక్షులుగా షేక్, అబ్బాస్, ప్రధాన కార్యదర్శి గా షేక్,ఇమామ్ సాబ్, కోసాధి కారిగా, షేక్ యాకూబ్ పాష, ను మరియు కార్య వర్గాన్ని ఏకగ్రవంగా ఎన్నుకున్నారు,అదే విధంగా యూత్ కమిటీ లో అధ్యక్షుడిగా షేక్ శారూఫ్ ఉపాధ్యక్షులుగా షేక్ ఆఫ్రోజ్ , ప్రధాన కార్యదర్శి గా షేక్ వాజిద్ , కోశాధికారి గా షేక్ ఫాయాజ్, కార్య వర్గ సభ్యులు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, ఈ కార్య క్రమంలో ముఖ్య అతిథిగా గ్రామ అధ్యక్షుడు కాటం వెంకట రామిరెడ్డి మరియు మైనారిటీ మండల ఇంచార్జి జక్కం సుబ్రహ్మణ్యం మండల మైనారిటీ అధ్యక్షుడు షేక్ సాదిక్ పాషా, మండల ప్రధాన కార్యదర్శి షేక్ గుల్ మొహమ్మద్, గ్రామ ప్రజలు గ్రామ యూత్ పాల్గొన్నారు.