దివ్యాంగులకు ఉచితంగా పరికరాలు పంపిణీ

Published: Tuesday October 05, 2021
మేడిపల్లి, అక్టోబర్ 4 (ప్రజాపాలన ప్రతినిధి) : ఏపీడీ సంస్థ ఫౌండర్ ఎన్ఎస్ హేమ జన్మదినాన్ని పురస్కరించుకొని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 7వ డివిజన్ గాయత్రీ నగర్ కాలనీలో అభిశ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏపీడీ  సంస్థ వారి సహకారంతో దివ్యాంగులకు ఉచితంగా పరికరాలు పంపిణీ కార్యమానికి ముఖ్య అతిధులుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ మాడుగుల చంద్రకళ చంద్రారెడ్డి పాల్గొని దివ్యాంగులకు పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్ మాట్లాడుతూ 160 మంది దివ్యాంగులకు ఉచితంగా పరికరాలు పంపిణీ చేయడం చాలా సాహసోపేతమైన నిర్ణయమని అందుకు కీలక పాత్ర పోషించిన అభి శ్రీ ఫౌండేషన్ ఆవుల వెంకటేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ పరికరాల పంపిణికి రూ.1.08లక్షల రూపాయలు వెచ్చించిన కార్పొరేటర్ మాడుగుల చంద్రకళ చంద్రారెడ్డిని అభినందించారు. రాబోయే రోజుల్లో మున్సిపల్ కార్పోరేషన్ నుండి కూడా ఖచ్చితంగా సహకరిస్తామని తెలియజేస్తూ మేము కూడా ఆర్థికంగా సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ కమీషనర్ కె.శ్రీనివాస్, కో ఆప్షన్ సభ్యులు షేక్ ఇర్ఫాన్, మున్సిపల్ AE వినీల్, టిపిఎస్ రాధాకృష్ణ, నాయకులు మాడుగుల చంద్రా రెడ్డి, పప్పుల అంజి రెడ్డి, అభి శ్రీ ఫౌండేషన్ ఆవుల వెంకటేష్, వికలాంగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.