ఘనంగా లంబాడ సేవాసమితి బహిరంగసభ.. హాజరైన ప్రముఖ గిరిజన నేతలు

Published: Monday November 21, 2022
వైరా, నవంబర్ 20 (ప్రజాపాలన న్యూస్):
 కోదాడలో తెలంగాణ లంబాడ సేవాసమితి భారీ బహిరంగ సభ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లంబాడా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు భూక్య సంజీవ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు బాదావత్ సైదులు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న ఆధునిక టెక్నాలజీకి అనుకూలంగా గిరిజనులు రాజకీయంగా, ఆర్థికంగా ఉన్న వనరులను ఉపయోగించుకోవాలన్నారు. తమ సమస్యలు పరిష్కారం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు కూడా చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి వారు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాణోతు పద్మ భాయ్, నాయకులు మాతృ నాయక్, జర్పుల ప్రసాదు, గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.