ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్125 జయంతి

Published: Monday January 24, 2022

ఇబ్రహీంపట్నం, జనవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి): మండలంలోని అన్ని గ్రామాల్లో భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రముఖులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి, పరాక్రమ దివస్ వేడుకలను యువజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వర్ష కొండ గ్రామంలో బస్టాండ్ వద్ద ఉన్న సుభాష్ చంద్ర బోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హిందూ సేన సభ్యులు మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు.