శంకరపట్నంలో బిజెపి ఆధ్వర్యంలో రాస్తారోకో శంకరపట్నం ఫిబ్రవరి 28 ప్రజాపాలన రిపోర్టర్:
శంకరపట్నం మండల కేంద్రంలో మంగళవారము బీజేపీ శంకరపట్నం మండల ఎస్టీ మోర్చా అధ్యక్షుడు బిజిలి సారయ్య అధ్వర్యంలో కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారి పై నిరసనగా రాస్తారోకో చేసారు. వరంగల్ కాకతీయ వైద్య కళాశాల గిరిజన పిజి విద్యార్థిని ప్రీతి తన సీనియర్, తెలంగాణ హోం మంత్రి మెహమూద్ అలీ బంధువు సైఫ్ వేధింపులకి తట్టుకోలేక ఆత్మహత్య చేస్కోని మరనించిగా రాష్ట్ర ప్రభుత్వం నిందితున్ని కాపాడకుండ కఠినంగా శిక్షించాలనీ డిమాండ్ చేస్తు నిరసన రాస్తారోకో కార్యక్రమము చెపట్టారు. ఈ కార్యక్రమములో బీజేపీ శంకరపట్నం మండల అధ్యక్షులు ఏనుగుల అనిల్, జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకట్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అలువెలి సమ్మిరెడ్డి, జిల్లా కార్యవర్గ సబ్యులు అంతం రాజి రెడ్డి, జంగ జైపాల్, జిల్లా సీనియర్ నాయకుడు దండు కొమురయ్య, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు ఎలుకపల్లి సంపత్, దాసరపు నరేందర్, ఉపాధ్యక్షులు పెసరి అర్జున్, కార్యదర్శి దాసరి సంపత్, ఎస్టీ మోర్చా మండలం ప్రధాన కార్యదర్శి లోకిని కుమారస్వామి, ఉపాధ్యక్షులు తిరుపతి సదయ్య, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి రెడ్డి రమణ రెడ్డి, ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు గౌరవేణి శ్రీను, ప్రధాన కార్యదర్శి నిమ్మశెట్టి సంపత్, బిజెవైఎం మండల అధ్యక్షులు బొడిగె నరేష్, ఉపాధ్యక్షులు నూనె కొండల్ రెడ్డి, నాయకులు పల్లె శివారెడ్డి, కోమల్ రెడ్డి, బడుగు రవి, మడ్డి సాయితేజ దున్నపోతుల కుమార్ తదితరులు పాలుగొన్నారు
Share this on your social network: