రైతులకు వరి వంగడాల పై క్షేత్రస్థాయి ప్రదర్శన

Published: Friday April 23, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని నాతాళ్లగూడెం గ్రామంలో ప్రభాత్ అగ్రి బయోటెక్ వారి కొత్త వంగడము ఆర్ఎస్ 100 అనే వరిపై రైతులతో క్షేత్రస్థాయిలో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఎస్వో రాజు, ఎండివో సుక్క కిషన్ మరియు  గ్రామ సర్పంచ్ ఉలిపే మల్లేష్, ఎంపిటిసి మోటె నర్సింహ, వివిధ గ్రామాల రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్వో రాజు మాట్లాడుతూ ఈ కొత్తరకం వంగడాల ద్వారా అధిక దిగుబడి సాదించుకోవచ్చని రైతులకు వివరించారు