పోలింగ్ కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలి
Published: Monday March 15, 2021
జిల్లా కలెక్టర్ పౌసుమి బసు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 14 ( ప్రజాపాలన ) : వికారాబాద్ జిల్లా పరిధిలోని మోమిన్ పేట మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని, నవాబుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ కేంద్రములో ఓటర్లు తప్పకుండ కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని ఓటర్లను కోరారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరన్స్ హాల్ యందు ఏర్పాటు చేసిన వెబ్ -క్యాస్టింగ్ ద్వారా జిల్లా మొత్తంలో జరుగుతున్న పోలింగ్ సరళిని జిల్లా ఎస్పీ నారాయణ, సహాయ ఎన్నికల అధికారి జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ తో కలిసి పరిశీలించారు.
Share this on your social network: