14వ డివిజన్ లో టీకా కేంద్రం ఏర్పాటు

Published: Monday September 06, 2021
బాలాపూర్: సెప్టెంబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి : ప్రజలకు కరోనా మహమ్మారి వైరస్ గురించి అవగాహన కల్పిస్తున్న మేయర్. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని 14వ డివిజన్ లో వైద్యాధికారు లతోపాటు మారి స్వచ్చంద సంస్ధ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా టీకా కేంద్ర సెంటర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ తో పాటు కలిసి మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ...... ఆదివారం పని చేసుకునే వాళ్ళు అందరు ఇంట్లోనే ఉంటారని టీకా వేసుకోవడం వల్ల కరోనా మహమ్మారి నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దూరంగా ఉండటం వల్ల, ప్రతి కాలనీవాసులు ఇప్పుడు దగ్గర్లోనే టీకా కేంద్ర సెంటర్ లో టీకా వేయించుకోవాలని ఎలాంటి అపోహలు నమ్మొద్దని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జెనిగే భారతమ్మ, సీనియర్ నాయకులు జెనిగే కోమరయ్య యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొర్ర జగన్ రెడ్డి, మారి సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.