జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలేరు లో జిల్లా విద్యాశాఖాధికారి ఆకస్మికంగా తనిఖీ

Published: Tuesday December 14, 2021
యాదాద్రి భువనగిరి జిల్లా 13 డిసెంబర్ ప్రజాపాలన ప్రతినిధి : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖాధికారి కానుగుల నరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అలాగే పాఠశాల రికార్డులను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఎన్ సి సి విభాగాన్ని పరిశీలించి ఎన్ సి సి గురించి, దాని పని విధానం గురించి  దూడల వెంకటేశ్ తో పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎన్సిసి కోటాలో ఐఐఐటీ సీట్లు పొందిన విద్యార్థుల గురించి అడిగి తెలుసుకొని విద్యార్థులను మరియు దూడల వెంకటేశ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్ నారాయణ, మండల విద్యాశాఖాధికారి లక్ష్మీనారాయణ, ఎన్సిసి అధికారి దూడల వెంకటేష్, ఉపాధ్యాయులు శ్యామసుందరి, యోగేశ్వరరావు హరినాథ్ రెడ్డి, మంద సోమరాజు, ఖాజా అలీ, సాంబశివ, నవీన్ కుమార్, సత్యనారాయణ, మురళి, రవి, వేణు, లక్ష్మమ్మ, స్వర్ణలత, విజయలక్ష్మి, కవిత, మీరా, సి ఆర్ పి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.