కుర్నవల్లిలో ఘనంగా అయ్యప్పల ఇరుముడి హాజరైన డాక్టర్ పట్టా దయానంద్..

Published: Tuesday November 22, 2022
తల్లాడ, నవంబర్ 21 (ప్రజాపాలన న్యూస్):
 తల్లాడ మండలంలోని కుర్నవల్లి గ్రామంలో అయ్యప్పల ఇరుముడి సోమవారం ఘనంగా నిర్వహించారు. 41 రోజులు కఠిన దీక్షలు చేసి అన్నం కోటారెడ్డి, గుర్రాల రమణారెడ్డి గురుస్వాములు ఆధ్వర్యంలో అర్చకులు వినోద్ శర్మచే ఇరుముడి కట్టుకొని 47మంది అయ్యప్ప స్వాములు శబరిమలకు బయలుదేరారు.
 ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్, గణేశుల రవి, బేబీ స్వర్ణకుమారి, కుర్నవల్లి సహకార సంఘం చైర్మన్ అయిలూరి ప్రదీప్ రెడ్డి, జంపాల వెంకటరమణ, శీలం నరసింహారెడ్డి  పాల్గొన్నారు.